6, ఆగస్టు 2013, మంగళవారం

ఈ రాత్రి

ఈ రాత్రి ఎప్పటికీ తెల్లవారదు
చీకటి దట్టంగా పేరుకుపోయింది
మనిషి లో స్వార్ధం లా.
ఆకాశం లో వెలుగు ఏ మూలనా లేదు
మరుగునబడ్డ మానవత్వంలా.
గాలి కూడా ఊళలు వేస్తుంది
మనిషిలోని వికృత విన్యాసాలకు తాళం వేస్తూ.
సమాజం చలనం కోల్పోయి
శాశ్వత నిద్ర పోతోంది  శవంలా.

దాన్ని మోసుకొచ్చారు  నలుగురు కొడుకులు, 
వాళ్ళేనట ప్రజాస్వామ్య మూల స్తంభాలు.
ఇప్పుడే తగలబెట్టాలి ఆ శవాన్ని
జరిపించాలి అరాచక సమాజపు అంత్యక్రియలు
తెల్లవారితే ఇక ఆ శవం తగలబడదు
అంతా చీకట్లో నే జరగాలి

అందుకే చీకటి దట్టంగా పేరుస్తున్నాడు మనిషి
శవం పూర్తిగా తగలబడేదాక రాత్రి తెల్లవారదు
తెల్లవారితే మళ్ళీ మనిషి కనబడడు.


1 కామెంట్‌: